2021 సంవత్సరానికిగాను మంచిర్యాల జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని భీమారం, జైపూర్, సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులను దక్కించుకున్నాయి. పనితీరు, కేసుల దర్యాప్తు, కచ్చితమైన విశ్లేషణ, నేరాల నియంత్రణ, సమర్థవంతమైన విచారణ, ప్రొయాక్టివ్ పోలీసింగ్, వర్టికల్ పెర్ఫార్మెన్స్ తదితర వాటిలో సాధించిన ప్రతిభ ఆధారంగా వీటిని ఎంపిక చేయగా, ఇందుకు కృషి చేసిన సిబ్బందికి సీపీ చంద్రశేఖర్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
– జైపూర్/భీమారం/సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 11
ప్రజల సహకారంతోనే నేరాలను అదుపుచేయగలుగుతున్నాం. రామగుండం కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి సూచనలు, ఆదేశాలతో నేరాలను నియంత్రించడంలో ముందున్నాం. జైపూర్ పోలీస్స్టేషన్ ఉత్తమ పోలీస్స్టేషన్గా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
-రామకృష్ణ, ఎస్ఐ, జైపూర్