ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 11 : ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని మసూద్చౌక్లో రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే రామన్న మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి టీ ఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. దీంతో రోడ్ల వెడల్పు, డివైడర్ల ఏర్పాటు, కూడళ్ల సందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని 49 వార్డుల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నామని చెప్పారు. రా ష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. పేదల సంక్షే మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీసీఐని ప్రారంభించే దాకా ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు బండారి సతీశ్, అజయ్, పండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జైనథ్ మండలంలోని మారుగూడ, జామిని, మేడిగూడ తదితర గ్రామాల్లో రూ.2.8 కోట్లతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే జోగు రామన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పనులు గొప్పగా సాగుతున్నాయన్నారు. జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు పెందోర్ దేవన్న, పెందోర్ శారద భరత్, సర్పంచ్లు మోహన్, సీమ శ్యాంసుందర్, ఉప సర్పంచ్ పోతారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప పోతన్న, ఎంపీడీవో పాల్గొన్నారు.