మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 16 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పా ఠశాల మైదానంలో శుక్రవాం 32వ సబ్ జూనియ ర్ (అండర్-16) రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, డీసీపీ అఖిల్ మహాజన్తో కలిసి సింగరేణి డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) బలరాం నాయక్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడు తూ.. ప్రతీ క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రమశిక్షణతో ఆడితే విజయం సాధ్యమవుతుందన్నారు. అనంతరం మైదానంలో క్రీడా జెండాలను ఎగురవేసి, క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
భారీ ర్యాలీ..
బెల్లంపల్లి చౌరస్తా నుంచి మంచిర్యాల బాలుర పాఠశాల మైదానం వరకు గుస్సాడీ కళాకారుల నృత్యాలతో ర్యాలీ సాగింది. 19వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం సంజీవ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, కౌన్సిలర్ చైతన్య రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఈసంపల్లి రాంచందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెత్తుల రాజేంద్రపాణి, కోశాధికారి శేఖర్, కార్యనిర్వాహక సభ్యులు రేగండ్ల ఉపేందర్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, డీసీఎస్వో బీ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ట్రస్మా ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నస్పూర్ మండల ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు మూల విష్ణువర్ధన్ రెడ్డి, సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు సత్యపాల్ రెడ్డి, పీఈటీలు సదానందం, రవి, కార్తీక్, చరణ్, సృష్టి రాజ్కుమార్ పాల్గొన్నారు.
హోరాహోరీగా…
మొదటి రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టుపై మంచిర్యాల జిల్లా జట్టు.., మహబూబాబాద్ జిల్లాపై నల్గొండ.., నిజామాబాద్ జిల్లాపై హన్మకొండ జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో వనపర్తి జిల్లా జట్టుపై రంగారెడ్డి.., వనపర్తి జిల్లాపై గద్వాల.., ఆదిలాబాద్ జిల్లాపై రాజన్న సిరిసిల్ల జట్టు గెలుపొందింది.