ఎదులాపురం/నిర్మల్ టౌన్, డిసెంబర్ 14 : ఈ నెల 26 లోగా ఓటర్ నమోదును పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఈఆర్వోలతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనా భా, ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై దృష్టి సారించాలన్నారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఫారం 6,7,8ల డేటా ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయని జనాభా ఆధారంగా ఓటర్ల నిష్పత్తిని చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఫారం -6 ద్వారా 24,655 డిజటలైజేషన్ ప్రక్రి య పూర్తయిందన్నారు. అనంతరం జిల్లా అధికారులుతో మాట్లాడుతూ ఈ నెల 26 నాటికి అన్ని రకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, బోథ్ ఈఆర్వో వెంకటేశ్వర్లు, ఎన్నికల వి భాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ సతీశ్, నాయబ్ తహసీల్దార్లు ప్రవీణ్ , మహేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన వీసీలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కా ర్యక్రమంలో తహసీల్దార్లు సుభాష్చందర్, రాకేశ్, సురేశ్ పాల్గొన్నారు.