చెన్నూర్, డిసెంబర్ 6: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపుతానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లోని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.35 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఇప్పటికే చెన్నూర్ పట్టణంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ఆ అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నికైన వారెవరూ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎన్నికైన వెంటనే నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి కాగా, పలు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం వంద పడకల దవాఖాన, బస్డిపో నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కన స్థలాన్ని పరిశీలించారు. 6.34 ఎకరాల్లో రూ.2.65 కోట్లతో నిర్మిస్తున్న మినీ స్టేడియం, పట్టణంలో రూ.25 కోట్లతో చేపడుతున్న ప్రధాన రహదారి విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు.
దళిత బంధు వాహనాల పంపిణీ..
చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పథకం ద్వారా ఐదుగురు లబ్ధిదారులకు వాహనాలు మంజూరయ్యాయి. వీటిని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వారికి పంపిణీ చేశారు. దళిత బంధు పథకం ద్వారా చెన్నూర్ పట్టణానికి చెందిన బోగె భారతి, గోగర్ల రవి, చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి గ్రామానికి చెందిన మోతె రాజేశ్కు కారు, నాగపూర్ గ్రామానికి చెందిన బడికెల సమ్మయ్యకు ట్రాక్టర్, కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన సంతోష్కు బొలేరో వాహనాలు మంజూరయ్యాయి. వారికి విప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, సింగిల్విండో చైర్మన్ చల్ల రాంరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రహదారి విస్తరణ పనుల పరిశీలన
జైపూర్, డిసెంబర్ 6 : ఎన్హెచ్-63 విస్తరణ పనులను రసూల్ పల్లె వద్ద విప్ బాల్క సుమన్ పరిశీలించారు. నాణ్యతతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
మంచిర్యాల – చెన్నూర్ హైవేపై పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. భీమారంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆవుడం క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డును పరిశీలించారు. ఎవరి ఇంటి వద్ద వారు వేసుకున్న ర్యాంప్లను తొలగించాలని, అంతర్రాష్ట్ర రోడ్డు కాబట్టి వాహనాలు అధిక స్పీడ్లో వస్తాయని, దాంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చే వారికి ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. 15 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఇది మండల కేంద్రం కాబట్టి ఇక్కడ పిచ్చి మొక్కలు లేకుండా, రోడ్లు శుభ్రంగా ఉం చాలి’ అని చెప్పారు.
సర్పంచ్ గద్దె రాంరెడ్డితో మాట్లాడుతూ.. ‘ఎంత మంది లేబర్లు ఉన్నా రు? రోడ్లు ఇలా ఉంటే ఎలా’ అని ప్రశ్నించారు. ఎఫ్డీవో శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడుతూ.. స్థానిక జోడువాగుల వద్ద ఫారెస్ట్ క్లియర్ చేసి ఇవ్వాలని ఈ పనులు పది రోజు ల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డివైడర్లో మొక్కలు నాటాలని, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. దా నికి ముందు స్థానికంగా ఉన్న ఆయిల్ పాం నర్సరీని పరిశీలించారు.టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కలగూర రాజ్కుమార్, చెన్నూర్ మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, సర్పంచ్ గద్దె రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్కుమార్ నాయక్, నాయకు లు వేముల శ్రీకాంత్ గౌడ్, జలంపల్లి తిరుప తి, నల్లాల రాజలింగు, దాసరి మధునయ్య, ఆత్కూరి రాము, భూక్యాలక్ష్మణ్, దాసరి మణిదీపక్, సుంకరి గోపాల్, సుంకరి భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.