కౌటాల, నవంబర్ 29 : విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం విద్యార్థులకు వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని, కడుపు నిండా భోజ నం చేసి చక్కగా చదువుకోవాలన్నారు. ఉన్నతస్థాయిలో నిలిచి కళాశాల పేరు, కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నే సిర్పూర్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా నిలపాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందు కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంత రం విద్యార్థులు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్న భో జనం పెట్టిన తర్వాత మేము కడుపు నిండా తిం టున్నామని, దీనివల్ల బాగా చదివేందుకు అవకాశం ఏర్పడింది’ అని అన్నారు. ఇంట్లో కన్నా రుచికరమైన భోజనం ఇక్కడ పెడుతున్నారని, తల్లిదండ్రులు కూడా ఒక రోజు కళాశాలకు వచ్చి భోజనం చేస్తామని చెప్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం ప్రారంభించిన తర్వాత తామంతా కళాశాలకు క్రమం తప్పకుండా వస్తున్నారన్నారు.
ఆడబిడ్డల పెద్దన్న కేసీఆర్..
ఆడబిడ్డల పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా 116 అందించి అండగా నిలుస్తున్నాడన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అ మలవుతున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోనూ మన లాంటి పథకాలు లేవని, అక్కడి ప్రాంత ప్రజలు మేము కూడా తెలంగాణలో ఉంటే బా గుండు అని అంటున్నారంటే మన పథకాలు ఎంత బాగున్నాయో అర్థం అవుతుందన్నారు. తాను దూర ప్రాంత ప్రజల కోసం కాగజ్నగర్ బస్టాండ్ వద్ద నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి కాగజ్నగర్ వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కడుపునిండా భోజనం చేసి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, తహసీల్దార్ మునావర్ షరీఫ్, కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంఆర్ఐ దేవేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.