శ్రీరాంపూర్/బెల్లంపల్లి/తాండూర్/రామకృష్ణాపూర్/కాసిపేట, నవంబర్ 29 : తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది. ప్రధానంగా వేజ్బోర్డులో ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ జాతీయ కార్మిక సంఘాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. జాతీయ కార్మిక సంఘాల వైఫల్యంతోనే వేజ్బోర్డు వేతన ఒప్పందం ఆలస్యమవుతున్నదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అనంతరం జనరల్ మేనేజర్లకు వినతిపత్రాలు సమర్పించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విధానాలతోనే జాప్యమవుతున్నదని, నేడు కలకత్తాలో జరిగే వేజ్బోర్డు సమావేశంలోనైనా నిర్ణయం తీసుకోవాలని, మెరుగైన వేతన ఒప్పందం చేయాలని నల్లసూర్యులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం అమలు జాప్యానికి జాతీయ కార్మిక సంఘాల వైఫల్యాలను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం కలకత్తాలో జరిగే వేజ్బోర్డు సమావేశంలో 30 శాతానికి తగ్గకుండా వేతన పెంచేలా కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యాలపై జాతీయ సంఘాలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వేతన ఒప్పంద కాలపరిమితి పూర్తయి 17 నెలలు పూర్తయినా పట్టింపులేదని విమర్శించారు. అందుకు జాతీయ కార్మిక సంఘాల మెతక వైఖరి, చేతగానితనమే కారణమని ఆరోపించారు.ఒప్పంద కుదిరే వరకు కార్మికులకు 25 శాతం ఇంటీరియం రిలీఫ్(ఐఆర్) చెల్లించాలని డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, సహాయ పిట్ కార్యదర్సి భాస్కర్, శ్రీరాంపూర్ ఓసీపీపై కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, పిట్ కార్యదర్శి కందుల శంకర్, ఆర్కే-5 గనిపై పిట్ కార్యదర్శి మహేందర్రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి నెల్కి మల్లేశం, ఆర్కే-5బీ గనిపై పిట్ కార్యదర్శి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి నీలం సదయ్య, ఆర్కే-6 గనిపై ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఆర్కే-7 గనిపై కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, పిట్ కార్యదర్శి మెండ వెంకటి, ఆర్కే న్యూటెక్ గనిపై ఏరియా చర్చల ప్రతినిధి బుస్స రమేశ్, పిట్ కార్యదర్శి శ్రీరాములు, ఏరియా వర్క్షాప్, జీఎం ఆఫీస్లో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, పిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, పీవీ రావు, రాళ్లబండి రాజన్న, సివిల్లో మల్లేశం, టింబర్ యార్డులో పిట్ కార్యదర్శి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, ఎస్సార్పీ-1 గనిపై ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్, పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.
బెల్లంపల్లి మండలం శాంతిఖని గని ఆవరణలో గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకులు వెంకటరమణ, రాజనాల రమేశ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాండూర్ మండలం అబ్బాపూర్ ఓసీపీ, ఏరియా స్టోర్స్ వద్ద నిరసన కార్యక్రమంలో పిట్ కార్యదర్శి గురజాల రమేశ్, నాయకులు గణపతి, వెంకటేశ్, అఫ్రోజ్, భాస్కర్, మల్లయ్య, కరీం, కల్పన, అబ్బాపూర్ ఓసీపీ పిట్ సెక్రటరీ బూర శ్రీనివాస్, నాయకులు సంపత్రావు, మందనపు రామారావు, సజ్జనపు శ్రీనివాస్, రాఘవరెడ్డి, వేముల కృష్ణ, దస్తగిరి, చందర్, కుమార్, హరిజయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆర్కే-1ఏ గనిపై టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి బండారి భిక్షపతి ఆధ్వర్యంలో జీఎం చర్చల ప్రతినిధి కే సత్యనారాయణరెడ్డి, హెచ్ రవీందర్, కంభగోని సుదర్శన్గౌడ్, కే సత్యనారాయణరెడ్డి, ఆడెపు రాజయ్య, సదయ్య, సుధాకర్, విద్యాసాగర్, అమ్మ అశోక్, మగువల రాములు, దురుశెట్టి మొగిలి, సాంబార్ రాజశేఖర్, శనిగారం రమేశ్ నాగరాజు, వినోద్, బీ శివ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, నాయకులు మేడ సమ్మయ్య, జాడి శివ, రమేశ్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.