నార్నూర్, ఫిబ్రవరి 3: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని చోర్గాంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్, పీఏసీఎస్ ఇన్చార్జి చైర్మన్ సురేశ్, డైరెక్టర్ కాంతారావు, నాయకులు షేక్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ రమేశ్, మాజీ సర్పంచ్ మర్సకోల తిరుపతి ఉన్నారు.
అంబకంటి గ్రామానికి చెందిన రొడ్డ ఎల్లన్న రైతు ఇటీవల మృతి చెందా డు. రైతుబీమా పథకానికి అర్హుడు కావడంతో ఎల్లన్న ఇంటికి గురువారం వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. ఏఈవో మహేశ్, సర్పంచ్ ముజిగే ప్రవీణ్, మాజీ ఎంపీటీ సీ గజ్జారాం, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి పోరాడు తూనే ఐక్యతంగా ఉంటూ సంఘం అభివృద్ధి కోసం పాటుపడు తామని తెలంగా ణ విద్యుత్ ఉద్యోగుల ఎస్సీ, ఎస్టీ ఎంప్లా యీస్ యూని యన్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్, గడ్డం మల్లేశ్ పేర్కొ న్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవ ర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్య క్షుడిగా నిర్మల్ జిల్లాకు చెందిన ఏడీఈ రమేశ్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ చాందకు చెందిన ఏఈ గడ్డం మల్లేశ్ ఎన్నికయ్యా రు. నిర్మల్ డివిజన్ కార్యద ర్శిగా బాలయ్య, అధ్యక్షుడి గా రాథోడ్ సీతారాం, భైంసా డివిజన్ అధ్యక్షుడిగా రాంబాబు, రూరల్ డివిజన్ కార్యదర్శిగా బాపురావు ఎన్నికయ్యారు.