ఆదిలాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ) ః రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా వచ్చిన వారికి అవసరమైన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశారు. 2020-2021లో కరోనా ప్రభావంతో చాలా మంది మృత్యువాత పడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం వ్యాధిని నివారించడంలో పూర్తిగా సఫలమైంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు ప్రతి ప్రభుత్వ దవాఖానలో వైరస్ సోకిన వారికి చికిత్స అందించారు. కిట్ల పంపిణీ, కరోనా వ్యాక్సిన్, బూస్టర్ డోస్లు ఇచ్చి వ్యాధి రాకుండా నివారించారు. ఐసొలేషన్ వార్డులు, ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. వైరస్ తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 ప్ర భావం చూపుతోందని వైద్యాధికారులు సూచిస్తున్నా రు. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, దగ్గు, జలు బు, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉం టా యి. వైరస్ ప్రభావం కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయి, ప్రాణాపా యం ఏర్పడే ప్రమాదం ఉంది. చలికాలం కావడం తో వై రస్ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి.
క రోనా నివారణకు అధికారులు అవసరమై న చర్య లు చేపట్టారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా చికిత్స అందించడానికి సర్వం సిద్ధం చేశారు. అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తు తం వ్యా ధి లక్షణాలు ఉన్న వారికి కరోనా చికిత్సలు అందిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగితే సేవలు అందించడానికి ప్రభుత్వ దవా ఖానల్లో వైద్యులు, సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కు లు తప్పనిసరిగా ధరించడంతోపాటు దూరం పాటించాలి. వ్యాధి లక్షణాలు ఉన్న వారు సర్కారు దవాఖానలకు వచ్చి చికిత్స తీసుకోవాలి. జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశాం.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్