కాసిపేట, ఆగస్టు 15 : సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వెన్నంటి ఉంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని పలువురికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డులను కాసిపేటలో సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రంరావు, ఎంపీడీవో ఎంఏ అలీం, సర్పంచ్లు ఆడె బాదు, భూక్యా సునీత, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య, టీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, అగ్గి సత్తయ్య, భూక్యా రాంచందర్, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ఖాన్, జాడి రాంచందర్, లంక లక్ష్మణ్ పాల్గొన్నారు.
జన్నారం, ఆగస్టు 15 : జన్నారం మండల పరిషత్ కార్యలయంలో 48 మందికి మంజూరైన కొత్త పింఛన్ కార్డులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి పద్మ, వైస్ చైర్మన్ గొట్ల రాజేశ్ యాదవ్, సింగిల్ విడో చైర్మన్ శీలం రమేశ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజారాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సీపతి బుచ్చన్న, ముత్యం సతీశ్, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్కుమార్,సులువ జనార్దన్, ఎంఏ రజాక్ పాల్గొన్నారు.
చెన్నూర్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా ఫించన్లను చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు పంపిణీ చేశారు.
జైపూర్, ఆగస్టు 15: జైపూర్ ఎంపీడీవో కార్యాలయంలో కొత్త పింఛన్ కార్డులను లబ్ధిదారులకు ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేశ్, కో ఆప్షన్ సభ్యుడు జైనుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు ఆర్నె సమ్మయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
భీమారం , ఆగస్టు 15 : మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన పింఛన్దారులకు ఎంపీపీ చెరుకు దీపికా రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్, రాష్ట్ర నాయకుడు చెరుకు సరోత్తమ రెడ్డి ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఎంపీటీసీ పెద్దల రూప-బాపు , రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ పర్తిరెడ్డి మహేశ్వర్రెడ్డి, సర్పంచ్లు దర్శనాల రమేశ్, నాయకులు పోడెటి రవి, కట్ట నాగరాజు, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, ఆత్కూరి రాము, ఎంపీడీవో శ్రీనివాస్, తసీల్దార్ వాసంతి పాల్గొన్నారు.
మందమర్రి, ఆగస్టు 15 : మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో నూతన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందించారు.