జిల్లావ్యాప్తంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీలు తీశారు. చిన్నారుల వివిధ నేతల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
ఆసిఫాబాద్,ఆగస్టు15 : జిల్లాకేంద్రంలోని జడ్పీ కార్యాల యం వద్ద జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆత్రం సక్కు జెండాను ఆవిష్కరించా రు. డీపీవో వద్ద ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్వో రాణాప్రతాప్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గాదెవేణి మల్లేశ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, చైతన్య కళాశాల వద్ద టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద డీఎఫ్వో దినేశ్కుమార్, డీఆర్డీవో కార్యాలయం వద్ద డీఆర్డీవో సురేందర్, దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు,్ర ప్రైవేట్ సంస్థల వద్ద ఆయా సంఘల అధ్యక్షుడు జెండాను ఎగురవేశారు.
వాంకిడి,ఆగస్టు 15 : తహసీల్దార్ ఎం,మధుకర్, ఎంపీపీ ముండే విమలాబాయి పీఏసీఎస్ చైర్మన్ జాబోరే పెంటయ్య తమ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. అలాగే వాం కిడి సర్పంచ్ బండే తుకారం, సీడీపీవో రేబాక్క, ఏపీఎం మహేశ్ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో పార్టీ మండలాధ్యక్షుడు జడ్పీటీసీ అజయ్కుమార్, దవాఖాన ఆవరణలో వైద్యుడు, సీఐ శ్రీనివాస్,ఎస్ఐ రమేశ్, ఆర్టీఏ చెక్పోస్ట్ ఆవరణలో ఎంవీఐ రవీందర్ జెండా ను ఎగురవేశారు.ఆయా కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సహకార సంఘం డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
రెబ్బెన, ఆగస్టు 15: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, తహసీల్దార్ రియాజ్అలీ, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ భూమేశ్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు రాపర్తి అశోక్, బీజేపీ అధ్యక్షుడు గోలేం తిరుపతి, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు జెండాలు ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ వేముర్ల సంతోష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, శ్రీ బాలాజీ ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో అంజాద్పాషా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, ఎంపీటీసీలు సంగం శ్రీనివాస్, పెసరి మధునయ్య, కోఆప్షన్మెంబర్ జౌరొద్దీన్, రైతుబంధు సమతి జిల్లా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, నాయకులు జుమ్మిడి ఆనందరావు, బొమ్మినేని శ్రీధర్ ఉన్నారు.
కెరమెరి, ఆగస్టు15: పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, ఎంఆర్సీ, అటవీ, విద్యుత్, వైద్య శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ, అంగన్వాడీ, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. మండలంలోని యువకు లు 75 మీటర్ల పొడువు జాతీయ జెండాను ప్రదర్శించి బస్టాండ్ ప్రాంతంలో మానవహారం చేపట్టారు. అనంతరం ఆర్మీ ఉద్యోగిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబా యి, తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేశ్, ఎంపీవో సుదర్శన్, విద్యుత్ శాఖ ఏఈ మందపెల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అబూల్ కలాం, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
జైనూర్, ఆగస్టు 15: జైనూర్, సిర్పూర్-(యూ) మండలా ల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జైనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పం చ్ పార్వతీలక్ష్మణ్, పోలీస్టేషన్లో సీఐ రామకృష్ణ, ఎమ్మార్సీలో ఎంఈవో సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షు డు ఇంతియాజ్లాలా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సహకార సంఘంలో చైర్మన్ కొడప హన్నుపటేల్, ఎంపీపీ కుమ్ర తిరుమల, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మోతుబాయి, పీహెచ్సీలో మండల వైద్యాధికారి నాగేంద్ర, సీడీపీవో ఇందిరమ్మ, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీదే వి, గుల్షన్, భారతి, గ్లోబల్ కేరళ గ్రామర్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మజర్ రజా, నరేందర్, నజీమొద్దీన్, షేక్ జమీల్, తహసీల్దార్ సాయన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ కుమ్ర తిరుమల, మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మండలకేంద్రంలో 75 మీటర్ల పొడవు జెండాతో ర్యాలీ తీశారు. అనంతరం ఆర్మీ కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, రాష్ట్ర హజ్కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, తహసీల్దార్ సాయన్న, ఎస్ఐ మధుకర్, మం డల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, లింగాపూర్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆత్రం అనిల్, సీనియర్ నాయకుడు అంబాజీరావు, గోపినాథ్ గిత్తె, అజ్జులాల, హైదర్, మజర్, కనక గంగారాం, శివరాం కేంద్రె, లక్ష్మణ్, సుబోద్, దౌలత్, అర్జున్, ప్రవీణ్ తదితరులున్నారు.
తిర్యాణి,ఆగస్టు15: విద్యావనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ ప్రత్యేకాధికారి షెడ్మకి రాము, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, తహసీల్దార్ మల్లిఖార్జున్, పోలీసు స్టేషన్లో ఏఆర్ఎస్ఐ మోహన్, ఏవో తిరుమలేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ చుం చు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మాండ్ల జగదీశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పశు వైద్యాధికారి రామకృష్ణ గౌడ్, టీజీబీ మేనేజర్ వంశీకృష్ణ, ఇన్చార్జి రేంజర్ సంతోష్ కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్, చెలిమెల, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, బాలుర ఆశ్రమ పాఠశాల హె చ్ఎం మడావి షేక్, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పార్టీల నాయకులు పతాకావిష్కరణ చేశారు.
లింగాపూర్,ఆగస్టు15: మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలలో హెచ్ఎం మధుకర్ రెడ్డి, ఎంపీపీ అడె సవిత, తహసీల్దార్ చిత్రు, గాంధీ చౌక్లో గ్రామపటేల్ కిరణ్నాయక్, వై ద్యాధికారి వినోద్ కుమార్ తమ కార్యాలయాల్లో, కేజీబీవీ పాఠశాలలో ప్రత్యేకాధికారి సరస్వతి జెండాను ఎగురవేశారు. అలాగే అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 15: పట్టణంలోని గాంధీ పార్కు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, సర్సిల్క్లో ఎమ్మెల్యే కోనే రు కోనప్ప జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాల యం, తెలంగాణ తల్లి చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ జెండాను ఆవిష్కరించారు. ఆర్యవైశ్య, నాయీ బ్ర హ్మణ, యాదవ సంఘం, లారీ అసోసియేషన్లో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు జెండాను ఎగురవేశారు. అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే ఫ్రీడం పార్కును ఈస్ఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ రూరల్, ఆగస్టు 15 : మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పంద్రాగస్ట్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్గాం పోలీస్టేషన్, ఎంపీడీవో, తహసీల్, ఎంఈవో, రూరల్ పోలీస్టేషన్, మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జా తీయ జెండాలను ఎగురవేశారు. మార్కెట్ కమిటీ కార్యాల యంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెండాను ఆవిష్కరిం చా రు. ఏడీఏ మనోహర్, పీఏసీఎస్లో చైర్మన్ ఉమా మహే శ్వర్రావు జెండాను ఎగురవేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఎంపీపీ శంకర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ), ఆగస్టు 15 : మండలకేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి రవి, తహసీల్దార్ రవీందర్ నాయక్, ఎంపీపీ చునార్కర్ సువ ర్ణ జెండాను ఎగురవేశారు. మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తఫిమా పర్వీన్, ఏవో మధులత, సామాజిక దవాఖానలో డాక్టర్ చెన్నకేశవ, పశువైద్యశాలలో డాక్టర్ తిరుపతమ్మ, సాంఘిక సంక్షేమ బాలికల పాఠ శాలప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఎఫ్ఆర్వో పూర్ణచందర్ రావు తమ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు. జడ్పీటీసీ నీరటి రేఖ, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్, ఉప సర్పంచ్ తోట మహేశ్, వార్డు సభ్యులు ఎండీ ఇఫ్పత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుకారం, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, బొమ్మన శ్రీనివాస్, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
కౌటాల, ఆగస్టు 15 : మండలకేంద్రంలోని పంచాయతీ కా ర్యాలయంలో సర్పంచ్ మౌనిశ్, జడ్పీ పాఠశాలలో హెచ్ఎం రమేశ్, పశు వైద్యాధికారి శ్రీకాంత్, ఎంపీపీ విశ్వనాథ్, తహసీల్దార్ రాంలాల్, ఇన్చార్జి ఎంఈవో హన్మంతు, డీసీ ఎంఎస్ వైస్ చైర్మన్ కుంరం మాంతయ్య జెండాను ఆవి ష్కరించారు. ఏవో రాజేశ్, ఎస్ఐ మనోహర్, ఏడీఈ రాజే శ్వర్, బ్యాంక్ మేనేజర్ నర్సింహస్వామి, ఐకేపీలో సీసీ తిరుప తి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలకేంద్రంలోని ఇన్ఫాంట్, శ్యాంమాడెల్ పాఠశాలల్లో సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీలు మనీశ్, శిరీష, సహకార సంఘం సీఈవో రాజేశ్, ఎంపీవో సుధాకర్ రెడ్డి, నాయకులు రవీందర్ గౌడ్, సంతోష్, నయీం, బాపు, రాంచందర్ శ్రీనివాస్, రాములు, గోపాల్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, ఆగస్టు 15 : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ డు బ్బుల నానయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గుం పుల విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, అంగన్వాడీలు త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎస్ఐ విజయ్ ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. బాలాజీ అ నుకోడ సర్పంచ్ రౌతు సుజాత ఉత్తమ సర్పంచ్గా ప్రశంసా పత్రం అందుకున్నది.
బెజ్జూర్, ఆగస్టు 15 : తహసీల్దార్ జమీర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎంపీపీ డోకె రోజా రమణి, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ మోహన్, డీఆర్వో శ్రావణ్ కుమార్, సహకార సంఘంలో చైర్మన్ కుర్సింగ ఓంప్రకాశ్, ఆశ్రమోన్నత పాఠశాలలో హె చ్ఎం పార్థీరాం, ఎమ్మార్సీలో ఎంఈవో రమేశ్ బాబు, గ్రామ పంచా యతీ లో సర్పంచ్ కొట్రంగి శారద జెండాను ఆవిష్కరించారు. జడ్పీ పాఠశాలలో హెచ్ఎం రవికుమార్, రైతుబంధు సమితి.జిల్లా కన్వీనర్ కోండ్ర జగ్గాగౌడ్, మాలీ సంక్షేమ సంఘంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, సర్పంచ్లు పతకాన్ని ఎగురవేశారు. మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. ఆయా కార్యక్రమాల్లో సహకార సంఘం మాజీ చైర్మన్ డోకె వెంకన్న, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీటీసీలు పర్వీన్ సుల్తానా, గురిజాల వెంకన్న, నాయకులు కోండ్ర నరేందర్ గౌడ్, జావిద్ అలీఖాన్, కోండ్ర సురేశ్ గౌడ్, జాహిద్ హుస్సేన్, పుల్లూరి సతీశ్, శ్రీవర్ధన్, తంగెడిపల్లి మహేశ్, చిప్పకుర్తి దేవాజీ పాల్గొన్నారు.
పెంచికల్పేట్,ఆగస్టు15 : పోలీసుస్టేషన్లో ఎస్ఐ రమణ్కుమార్, పీహెచ్ సీలో వైద్యాధికారి ముస్తఫా, జడ్పీ పాఠశాలలో హెచ్ఎం భానుప్రకాశ్, కేజీబీవీలో ఎస్వో కవిత, ఎంపీపీ జాజీమొగ్గ సుజాత, రేంజర్ వేణు గోపాల్ తమ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు. రైతు వేదిక లో అధ్యక్షుడు చౌదరి తిరుపతి, తహసీల్దార్ అనంతరాజు, ప్రధానోపాధ్యా యులు, సర్పంచ్లు తమ కార్యాయాల్లో జెండాను ఎగురవేశారు. జడ్పీ పాఠశాల, ఎంపీపీఎస్ సంజీవ్నగర్, సెయింట్ క్లారిట్ పాఠశాలల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
దహెగాం,ఆగస్టు15 : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కంభగౌని సులోచన, తహసీల్దార్ రామ్మోహన్రావు, సహకార సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏవో వంశీకృష్ణ, పోలీస్స్టేషన్లో ఎస్ఐ సనత్కుమార్, పీహెచ్సీలో వైద్యాకారి క్రాంతికిరణ్, విద్యుత్ శాఖ ఏఈ రవీందర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అమరేందర్, కసూర్బాలో ఎస్వో రమాదేవి త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు, ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు రామ్మోహన్, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, సర్పంచ్లు తమ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించారు.