ఎదులాపురం, జనవరి 19 : ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కేంద్ర ర్యాపిడ్ యాక్షన్ బలగాలు గురువారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ 91వ బెటాలియన్కు చెందిన 80 మంది ఎస్పీ, ఏఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ డీఎస్పీ ఉమేందర్, ఆర్ఏఎఫ్ డీఎస్పీ శశాంక్తో కలిసి వినాయకచౌక్, మసూద్ చౌక్, ఖానాపూర్, బొక్కలగుడ, ప్రభుత్వోన్నత పాఠశాల, జూనియర్ కళాశాల మీదుగా ర్యాలీ తీశారు. జిల్లా ప్రజలు ర్యాలీగా వస్తున్న వారిపై పూలు చల్లి అభినందించారు.
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలాంటి సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంది.. మత కల్లోలాలు జరిగినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ప్రజలు ఎలా వ్యవహరించాలి.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లోకి మహిళల పాత్రపై, ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని ,వివిధ ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బలగాల కవాతు ఈ నెల 24 వరకు ఉట్నూర్, బోథ్, నేరడిగొండ, జైనథ్, ఇచ్చోడలో వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వా తావరణంలో శాంతి భద్రతల సమస్యలు లే కుం డా ఉండేందుకే ముందస్తుగా ర్యాలీలు నిర్వహిస్తుంటారని తెలిపారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు ఉన్నారు.