ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 20: ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ మేళాను ఆదిలాబాద్ కలెక్టెర్ సిక్తా పట్నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మేళాలో ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాచలం ఆదివాసీలు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులను ప్రదర్శించారు. వీటిని కలెక్టర్, పీవో, ఎమ్మెల్యే పరిశీలించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన హస్తకళలకు రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ఐటీడీఏ ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాకారులు ఆర్థికాభివృద్ధి సాధించేలా గోండి పేయింటింగ్స్, డ్రైమిక్స్, ఉసిరి ఉత్పత్తుల తయారీ, ఆదివాసీ ఆహారం, చిక్కీ యూనిట్, ట్రైబల్స్ ఆర్ట్స్, క్రాఫ్ట్, కోయకల్చర్ ఆర్ట్స్, వుడ్క్రాప్స్, బంజారా సంప్రదాయ దుస్తుల తయారీ తదితర కళలకు నిరంతరం మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం : పీవో
గిరిజన హస్తకళలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి తెలిపా రు. గిరిజన హస్తకళాకారులు, మహిళా సమాఖ్య సభ్యులు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి మార్కెటింగ్ చేస్తామన్నారు. కళాకారులు సైతం మార్కెట్లో ఉన్న డిమాండ్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అవసరమైన డిజైన్ల తయారీకి ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.
బాహ్య ప్రపంచానికి తెలిసేలా.. : ఎమ్మెల్యే
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, హస్తకళలు బాహ్య ప్రపంచానికి తెలిసేలా మేళా నిర్వహించడం అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులకు దేశ విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలిపారు. గిరిజన హస్త కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకుముందు గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండి యా రీజినల్ మేజేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గిరిజన హస్తకళా మార్కెటింగ్, ఎగ్జిబిషన్, కళాకారుల నమోదు, శిక్షణ వంటి వాటిపై సుదీర్ఘంగా వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజ, హ్యాండ్ల్యూమ్స్, హస్తకళల మంత్రిత్వ శాఖ అధికారి దివ్యరావు, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జా దవ్, జేడీఎం నాగభూషణం, హెచ్వో సుధీర్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, రైతుబంధు సమి తి మండలాధ్యక్షడు అజీమొద్దీన్, క్రీడల అధికారి పార్థసారథి, ఇతర అధికారులు, గిరిజన హస్తకళాకారులు తదితరులు పాల్గొన్నారు.