ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,జూన్15: వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తల్లిదండ్రుల పోషణ, రక్షణపై పిల్లలు శ్రద్ధ వహించాలని సూచించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చూపడం, వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. వృద్ధులు సాయం కోసం హెల్ప్లైన్ టోల్ఫ్రీ నెంబర్ 14567కు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, కమిటీ సభ్యులు కిషన్, రామ్ కులకర్ణి, దేవిదాస్, సత్యనారాయణ, భాస్కర్, హనుమంత రావు ఉన్నారు.