టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ బుట్టి శివకుమార్
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 22 : నూతన జోనల్ వ్యవస్థతో యువతకు ఎంతో మేలు కలుగుతుందని టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ బుట్టి శివకుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన జోన్ల ఏర్పాటును హర్షిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన జోన్లపై రాష్ట్రపతి సంతకం చేయడం శుభపరిణామన్నారు. దీంతో సొంత జిల్లాలోనే 90శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయన్నారు. టీఆర్ఎస్వీ నాయకులు వాగ్మారే ప్రశాంత్, మనోజ్, కంచర్ల్ల సాయి, రఘు, విజయ్, మహేశ్, సన్ని పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి టీఎన్జీవో ఉద్యోగుల అభినందన
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 22 :జోనల్ వ్యవస్థను మార్చి బాసరను కొత్త జోన్గా ఏర్పాటు చేయడంతో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఉద్యోగులందరూ రుణపడి ఉంటారని టీఎన్జీవో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, జిల్లా నాయకులు సృజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వరంగల్ జోన్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఉండగా.. బాసరను కొత్త జోన్గా ఏర్పాటు చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాను చేర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు త్వరితగతిన లభిస్తాయని తెలిపారు. కొత్త జోన్ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి
అందరికీ వ్యాక్సినేషన్కు ఎంతంటే..!?
IPL 202: పడిక్కల్ మెరుపు శతకం..బెంగళూరు సూపర్ విక్టరీ