తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మండలానికి చెందిన తాంసి, బండలనాగాపూర్, కప్పర్ల, గిరిగాం లబ్ధిదారులు 10 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు వరం కల్యాణలక్ష్మి పథకమని పేర్కొన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదన్నారు.
మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, మాజీ జడ్పీటీసీ పులినారాయణ, సర్పంచులు కృష్ణ, సదానందం, వెంకన్న,కేశవ్రెడ్డి, నర్సింగ్, ఎంపీటీసీ రఘు, నాయకులు ఉత్తం, ధనుంజయ్, గంగారాం తదితరులున్నారు.