నెన్నెల, మార్చి18: ఓటరు జాబితాల్లో తప్పులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ రాహుల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. నెన్నెల, మైలారంలోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వీలులేని వృద్ధులు, దివ్యాంగులకు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలను బీఎల్వోలకు వివరించారు. ఫారం 12 డీని వారికి అందజేయాలన్నారు.
ఓటు హక్కు ఉండి కేంద్రానికి వెళ్లలేని వారిని ముందుగానే గుర్తించి తగిన ఏరాట్లు చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్నికల టీం ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కదలలేని వారి ఇంటికి ప్రత్యేక టీం వెళ్లి అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఆర్ఐ గణేశ్, ఎంపీవో శ్రీనివాస్, బీఎల్వోలు ఉన్నారు.