మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 29 : జిల్లాలోని డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గెడం గోపాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశాల మేరకు కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. క్వాలిటీ ధాన్యాన్ని సేకరించాలని, నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రిజిస్టర్లను పరిశీలించారు.
జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, జైపూర్, భీమారం, కోటపల్లి, చెన్నూర్, వేమనపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒకటీ.. రెండు రోజుల్లో పూర్తవుతాయన్నారు. జనవరి 10వ తేదీలోగా కొనుగోళ్లు పూర్తి చేసి ట్యాబ్లలో ఎంట్రీలు చేయాలని కోరారు. డీఎం వెంట సివిల్ సప్లయ్ కార్యాలయ డీఆర్పీ రామస్వామి ఉన్నారు.