కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ రాంపూర్ కు చెందిన తోటపల్లి శంకర్ (50) తాగుడుకు బానిసై ( Alcohol ) ఉరివేసుకొని ఆత్మహత్య( Suicide ) చేసుకున్నట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. శంకర్ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై పనికి వెళ్లకు కుటుంబ సభ్యులతో చనిపోతానని బెదిరించేవాడని తెలిపారు.
వారం రోజులుగా విపరీతంగా మద్యం తాగుతుండడంతో మద్యం బంద్ చేయాలని కుటుంబ సభ్యులు మరోసారి కోరారు. దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి దూళానికి చీరతో ఉరి వేసుకొని చనిపోయాడని వివరించారు. ఈ మేరకు భార్య తోటపల్లి దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.