సోన్, మార్చి 9 : చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఆ కుటుంబానిది. తండ్రి కష్టాలను చూసి ఆ కుమారుడు తండ్రికి అండగా ఉండేందుకు గల్ఫ్ దేశం వెళ్లాడు. సంపాదించే సమయంలోనే తండ్రి భోజన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుమారుడు రాజుల భీమేశ్ (28) సొంత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తన పంట చేనును అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు చుట్టూ కంచె ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. ప్రమాదవశాత్తూ ఆ కంచెకు తగిలి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లిలో గురువారం విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామానికి చెందిన భోజన్నకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న ఎకరన్నర భూమిలో వ్యవసాయం చేస్తుండేవాడు. కుమారుడు భీమేశ్ నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం పంపాడు. అక్కడ భీమేశ్ పని చేస్తుండగానే తండ్రి మృతి చెందిన వార్త తెలియగానే తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అన్నీ తనే అయ్యి అక్కకు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు. ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భీమేశ్.. మక్క పంట కంకుల దశకు చేరుకోవడంతో అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బుధవారం రాత్రి పంట చుట్టూ విద్యుత్ తీగను అమర్చి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం పంట చేనుకు వెళ్లి మక్కకు నీరును పెట్టేందుకు మోటరు ను ఆన్చేసి వెళ్తుండగా.. పంటలో పైపు ఊడిపోవడాన్ని గమనించిన భీమేశ్ దాన్ని బిగించే క్రమంలో విద్యుత్ తీగ తగిలి అక్కడికక్క డే మృతి చెందాడు. అయితే భీమేశ్కు రెండు సంవత్సరా ల క్రితం మామడ మండలంలోని రాయదారి గ్రా మానికి చెందిన యువతితో పెళ్లి జరగగా.. పది నెలల బాబు ఉన్నాడు. మూడేండ్ల క్రితం తండ్రి, ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో ఆ కు టుంబంలో తీవ్ర విషా దం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.