మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 27 : మంచిర్యాల జిల్లా అడవుల్లో పులి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతం లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మూడు రోజుల క్రితం కాటేపల్లి బీట్ పెద్దవాగు పరిసరాల్లోని చిందమడుగు అటవీ ప్రాంతంలో ఆవుపై పెద్దపులి దాడి చే సింది. దీంతో అటవీశాఖ అధికారులు పులి జా డ వేటలో పడ్డారు. కాళేశ్వరం జోన్ ఎఫ్డీపీటీ వినోద్ కుమార్ పర్యవేక్షణలో పులి తిరిగే ప్రాం తంలో 62 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను అధికారులు సేకరిస్తున్నారు. యానిమల్ ట్రాకర్స్, బేస్క్యాంప్, హిటికోస్ సిబ్బంది ప్రత్యక్ష నిఘా పెట్టారు. ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులి కదలికలను అధికారులు ఎంతో గోప్యంగా ఉంచుతూ రికార్డు చేస్తున్నారు. ఆవు కళేబరం ఉన్న ప్రాంతంలో పులి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంపై అధికారులు ప్రత్యేక్ష నిఘా పెట్టారు.
ఏడాది తర్వాత పులి ప్రత్యక్షం
మంచిర్యాల జిల్లాలో ఏడాది తరువాత మళ్లీ పులి ప్రత్యక్షమైంది. సంవత్సరం క్రితం పెద్దపులి దాడి చేసి కొంత మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తర్వాత అలజడి లేకపోవడంతో హా యిగా ఉన్న ప్రజలు ఇప్పుడు పులి కలకలం రేపడంతో మళ్లీ వణికిపోతున్నారు. ప్రస్తుతానికి పులి ఎక్కడున్నది.. ఎక్కడ తిరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషుల పై దాడులు చేయకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కే 12 గా గుర్తించినట్లు సమాచారం..
కుశ్నపల్లి, నీల్వాయి రేంజ్లో తిరుగుతున్న పులి కే -12 ఆడపులిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. పాదముద్రల ఆధారంగా దాదాపు 13 సెంటీమీటర్లు పాదముద్ర గల పులి అడుగును అధికారులు సేకరించారు. ఫాల్గుణ పులికి రెండో ఈతలో పుట్టిన కే -8 పులి సంతతిగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కే-8 పులికి మూడు పులి పిల్లలు కాగా, సుమారు 22 నెలలు వయస్సు ఉన్నట్లు భావిస్తున్నారు. తల్లి కే-8తో రెండు పులి పిల్లలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోహగుట్ట, అగర్గూడ అడవుల్లో సంచరిస్తున్నట్లు, కే-12 పులి చెన్నూర్, బెల్లంపల్లి డివిజన్లలో పులి తిరుగుతున్నట్లు అధికారులు వెళ్లడించారు.
వేమనపల్లి అడవుల్లో ఆవును హతమార్చింది పులే
వేమనపల్లి, ఆగస్టు 27 : నీల్వాయి రేంజ్ పరిధిలోని గొర్లపల్లి బీట్ కాటేపల్లి అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసి చంపినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దస్నాపూర్లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యజమాని కుక్కల చంద్రయ్యను వివరణ కోరగా మూడు రోజుల క్రితం తన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని, కాపరిని అడగగా అటవీ ప్రాం తంలో తప్పిపోయిందని , మరుసటి రోజు వెళ్లి ఆవును తీసుకువస్తానని కాపరి తెలిపినట్లు పేర్కొన్నాడు. కాగా శనివారం నీల్వాయి ఫారెస్టు రేంజ్ పరిధిలోని అటవీ అధికారులు కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని వేమనపల్లి సెక్షన్ అటవీ శాఖ అధికారులు అడవిలో సంచరిస్తుండగా కాటేపల్లి అటవీ ప్రాంతంలో ఆవు కళేబరాన్ని గుర్తించా రు. దీంతో ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి అడుగులు ఉన్నట్లు గుర్తించి పులే ఆవును చం పిందని ఆ శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో దస్నాపూర్ గ్రామానికి చేరుకొని విచారించగా చంద్రయ్యకు చెందిన ఆవుగా గుర్తించారు. అప్పటికే రాత్రి కావడంతో ఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆదివారం ఉదయం అటవీ శాఖ అధికారులు, ఆవు యజమాని అటవీ ప్రాంతానికి వెళ్లి చూడగా కళేబరాన్ని చూసి నిర్ధారించాడు. సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో పుటేజీ ఆధారంగా కే12 పులిగా అటవీ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. చనిపోయిన ఆవు విలువ రూ.20 వేలు ఉంటుందని నష్టపరిహా రం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.