తలమడుగు, అక్టోబర్ 25 : మండలంలో బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్కు మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ బుధవారం విజయ వంతమైంది. మండలంలోని దేవాపూర్ ఎక్స్ రోడ్డు అనిల్ జాదవ్కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు వెయ్యి ద్విచక్ర వాహనాలతో దేవాపూర్ నుంచి మొదలైన బైక్ ర్యాలీ పల్లి ఎక్స్రోడ్డు, భరంపూర్, అర్లి, రుయ్యాడి, తల మడుగు, కొత్తూరు, సుంకిడి, ఉండం గ్రామాల మీదుగా ర్యాలీ కొనసాగింది. జెండాలతో గ్రామా లు గులాబీమయమయ్యాయి. సుంకిడి గ్రామం వద్ద కార్యకర్తలు, అభిమానులు అనిల్ జాదవ్కు గజామాలతో సత్కరించారు.
అనంత రం ఉండం సమీపంలో గల ఆయుషా గార్డెన్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎంపీ గొడాం నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన యువ కులు పార్టీలో చేరారు. మహిళలు బతుకమ్మ పాటలపై నృత్యాలు చేశారు. ఉమ్రి గ్రామానికి చెందిన గిరిజనులు వారి సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ బోథ్ ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరి స్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకా లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. మండ లంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ప్రతి కార్యకర్త గ్రామస్థాయి లో కష్టపడి పని చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించాలన్నారు. నియోజకవర్గంలోని తలమ డుగు మండలం అత్యధిక మెజార్టీ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట వెంకటేశ్, జిల్లా నాయకులు పిడుగు సంజీవ్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, వసంత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కంది నర్సిములు, పిడుగు అభి రాం రెడ్డి, మొట్టె కిరణ్, జీవన్ రెడ్డి, అబ్దుల్లా, రంజిత్ రెడ్డి, మడూరి మల్లేశ్, రమాకాంత్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, అక్టోబర్ 25 : ఒక్క అవ కాశం ఇచ్చి ఆశీర్వదించండి.. ఆభివృద్ధ్ది చేసి చూపి స్తా.. అని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పూలాజీబాబా కాలనీలోని శారదామాత నిమజ్జన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని పాత బస్టాండ్ నుంచి మహిళలు, గ్రామస్తులు మంగళహరతులతో ఘనంగా స్వాగతం పలికా రు. అనంతరం అమ్మ వారికి వేదపండితుల ప్రత్యే క పూజలు నిర్వహించారు. పులాజీబాబా కాలనీ లోని అంతర్గత రోడ్లు నిర్మిస్తామని, కాలనీ వాసు లకు పక్కా ఇండ్లు మంజూరు అయ్యేలా చూస్తాన ని హామీ ఇచ్చారు. నాయకులు మడిగే రమేశ్, అల్కె గణేశ్, నానం రమణ, చట్ల ఉత్తం, కొత్త శంకర్, చట్ల గజ్జయ్య, చట్ల వినల్, తూరటి భోజ న్న, జ్ఞానే శ్వర్, యోగి, శ్రీనివాస్, మల్లేశ్, నానం రమణ, పులాజీబాబా కాలనీవాసులు, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.