ఎనిమిదో రోజూ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
పలుచోట్ల పనులు పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
క్రీడాప్రాంగణాలు, నర్సరీల సందర్శన
క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు
పారిశుధ్యం, పచ్చదనంపై ప్రజలకు అవగాహన
పల్లె, పట్టణాల్లో చేపట్టిన ప్రగతి కార్యక్రమాలు ఊరూరా, పట్టణాల్లో పండుగలా సాగుతు న్నాయి. ఎనిమిదో రోజైన శుక్రవారం ఆయా చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు తిరుగు తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, హరితహారం, వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రగతి పనులను పరిశీలించి, సిబ్బందికి సలహాలు అందించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, నిర్మల్ జిల్లా తానూర్ మండ లంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, లక్ష్మణచాంద మండలంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యటించి పనులను పరిశీలించారు.
ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎనిమిదో రోజైన శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. గ్రామాలు, పట్టణా ల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలియదిరిగారు. ప్రగతి పనులను పర్యవేక్షించారు. పల్లె ప్ర కృతి, పల్లె బృహత్ ప్రకృతి వనాలను సందర్శించి వాటి సంరక్షణకు పలు సూచనలు చేశారు. క్రీడాప్రాంగణాలు, నర్సరీలను పరిశీలించారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం, గోండ్ హర్కాపూర్ గ్రామాల్లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, బేల మండలంలోని సదల్పూర్లో జడ్పీ సీవో రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూపోచంపాడ్, వెల్మల్ బొప్పారం, లక్ష్మణచాంద మండలంలోని పార్పెల్లి, పొట్టపెల్లి(బి) గ్రామాల్లో ప్రగతి పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. తానూర్ మండలంలోని దౌలతాబాద్ గ్రామంలో రైతువేదిక, స్మశానవాటిక, సీసీ రోడ్లను ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రారంభించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ అంకం రాజేందర్ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టారు. జేసీబీతో డ్రైనేజీలో పూడిక తీయించారు.
ఖానాపూర్ టౌన్ : ఐదో వార్డులో పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్
ఇంద్రవెల్లి : మురుగు కాలువ నుంచి పూడిక తీస్తున్న కార్మికులు
భీంపూర్ : తాంసి(కె) ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్