మంచిర్యాల అర్బన్, జనవరి 26 : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో
శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అవార్డులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 202 మందికి అవార్డులు పంపిణీ చేశారు.