ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్లు మాట్లాడుతూ.. జిల్లాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంగా మారిందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, జనవరి 26 ( నమస్తే తెలంగాణ): ఆదిలాబా ద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవ వం దనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా, నటరాజ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నద ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లా లో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపా రు. పల్లెప్రగతి కార్యక్రమం ఫలితంగా గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొందని, ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదోస్థానాన్ని సం పాదించడం సంతోషకరమన్నారు. జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్ర జలకు నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి వి డుతలో 237 పాఠశాలల్లో పనులు చేపట్టామని, 20 మోడల్ స్కూళ్ల పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామ న్న అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పేదలకు కండ్ల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. హరితహారంతో గ్రామాల్లో పచ్చదనం నెలకొందని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలు మహిళలకు వరంలా మారాయన్నారు.
నిర్మల్ టౌన్, జనవరి 26: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 74 వ రిపబ్లిక్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వ హించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జా తీయ జెండాను ఎగుర వేశారు. భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించా రు. ఎస్పీ ప్రవీణ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ వి జయలక్ష్మి, భైంసా ఏఎస్పీ కిరణ్ఖారే, అదన పు కలెక్టర్లు హేమంత్ బో ర్కడే, రాంబాబు, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మ న్ గండ్రత్ ఈశ్వర్, డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, అధికారులు శ్రీలత, అంజిప్రసా ద్, శ్రీనివాస్రెడ్డి, హన్మండ్లు, రాజేశ్వర్గౌడ్, నర్సింహారెడ్డి, జడ్పీ సీఈ వో సుధీర్కుమార్, శంకర్, అశ్వ క్, శంకరయ్య, అశోక్కుమార్, నాయకులు సత్యనారాయణ, రాము, తదితరులున్నారు.