మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, జూన్ 28 : నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022-2 3 ఆర్థిక సంవత్సరానికి జిల్లా ఆర్థిక రుణ ప్రణాళికలో స్వల్పకాలిక రుణాలు రూ. 1, 951 కోట్ల రూపాయలు, దీర్ఘకాలిక రుణాలు రూ. 952 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రు ణాలు రూ.687 కోట్లు, వ్యవసాయ రుణాలకు రూ.102 కో ట్లు, ప్రాధాన్యత రంగ గృహా రుణాలకు రూ.237 కోట్లు, మొ త్తం ప్రాధాన్యత రంగాలకు రూ.3, 996 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా ప్రాధాన్యేతర రంగాలకు రూ.299 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 4, 295 కోట్లు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందన్నారు.
8 వేల 333 గ్రామీణ స్వయం సహాయ సంఘాలకు గాను రూ. 358 కోట్లు, పీఎంఎఫ్ఎంఈ 60 యూనిట్లు లక్ష్యంగా ఆయా బ్యాంకుల వారీగా నిర్దేశించినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ పథకంలో భాగంగా 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 153 మంది లబ్ధిదారులకు సంబంధించి గ్రౌండింగ్ చేయాల్సి ఉందని, జిల్లాలో ఎన్పీఎ కింద రూ.102 కోట్లు వసూలు చేయవలసి ఉందని, ఎస్టీ కార్పొరేష న్ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చేయాలని, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టిసారించాలని ఆదేశించారు. ప్ర భుత్వం రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వరి పంట రుణ పరిమితి ఎకరాకు రూ. 36 వేల నుంచి రూ. 40 వేలుచ పత్తి పంటకు ఎకరాకు రూ. 38 వేల నుంచి రూ.40 వేల తో పాటు ఇతర పంటకు పరిమితి నిర్దేశించినట్లు చెప్పారు.
పాడిరైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బర్రెలు, ఆవులు ఒక్కొక్క దానికి రు ణ పరిమితి రూ.23, 400 నుంచి రూ.25 వేల వరకు నిర్దేశించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, ఆర్బీఐ, ఏజీఎం, రాజేంద్రప్రసాద్, డీడీఎం అబ్దుల్ రవూఫ్, ఆర్ఎస్ఈఏటీ ఉ ట్నూర్ సంచాలకులు కుమ్రం లక్ష్మణ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ చం ద్రశేఖర్ రెడ్డి, యూబీఏ మేనేజర్ గౌతమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సాగర్ రావు, విజయ డెయిరీ డీడీ మధుసూదన్ రావ్, తదితరులున్నారు.