మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు, ప్రధాన చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు తీసుకెళ్తున్నారు.
వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
– ఫొటోలు : మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్