సారంగాపూర్, ఫిబ్రవరి 7: మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 యూనిట్లు కేటాయించగా, వీటి కోసం సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన 35 మండలాల పరిధిలో గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనుండగా, ఒక్కో యూనిట్కు రూ. లక్ష నుంచి రూ. 1. 25 లక్షల వరకు రుణం అందించనుంది. వీటిని పొందిన సభ్యులు ఐదేళ్ల కాల పరిమితితో వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. కాగా ఉత్పత్తి అయిన కరెంట్లో గృహ అవసరాల వినియోగం తర్వాత మిగులును గ్రిడ్కు అనుసంధానించే ఏర్పాట్లు చేయనుంది.
విద్యుత్ చార్జీల భారాన్ని తప్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పొదుపు (డ్వాక్రా) సంఘాలకు చెందిన సభ్యులకు స్త్రీనిధి కింద రుణ సదుపాయాన్ని కల్పించి సౌర యూనిట్లు అందజేయాలని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాకు 1260 యూనిట్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కుమ్రంభీం జిల్లాల పరిధిలో 3,11,507 సంఘాలు, 5,56,307 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 సౌర యూనిట్లు మంజూరయ్యాయి. ఇందు కోసం ప్రభుత్వం సుమారు రూ. 14 కోట్లు కేటాయించింది. ఒక్కో యూనిట్కు రూ. లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు రుణం అందించనుంది. గ్రామసభలు నిర్వహించి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఈ నెల 28 తేదీ లోగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూనిట్ ఏర్పాటుకు తీసుకున్న రుణాన్ని వాయిదాల ప్రకారం చెల్లించేందుకు ఐదేళ్ల కాలపరిమితిని విధించారు.
ఉమ్మడి జిల్లాలో 35 మండలాలు..
పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి జిల్లాలో 35 మండలాలను ఎంపిక చేశారు. సభ్యురాలు తమ గృహ అవసరాల నిమిత్తం నెలకు 200నుంచి 300 యూనిట్లు వాడుకున్నట్లయితే 2కిలో వాట్స్, 3కిలో వాట్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశముంది. రోజుకు సుమారు 8నుంచి 12యూనిట్ల్ల వరకు ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. యూ నిట్ల ఏర్పాట్లలో భాగంగా నెట్ మీటరు అమర్చుతారు. అవసరం కంటే అధికంగా ఉత్పత్తి అయితే దానిని నెట్ మీటరు సాయంతో గ్రిడ్కు అనుసంధానిస్తారు. దానిని ట్రాన్స్కో కొనుగోలు చేస్తుంది.
మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం…
సోలార్ యూనిట్లపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ఉత్పత్తి అయి న మిగులు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి అవసరం మేరకు వాడుకోవచ్చు. ఎస్హెచ్జీల సభ్యులకు సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.25లక్షల వరకు స్త్రీనిధి ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాయిదాల రూపంలో నెలనెలా తిరిగి కట్టాల్సి ఉం టుంది. సోలార్ కరెంట్ వినియోగం వల్ల కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రాదు. -పూర్ణచందర్, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ జిల్లా