తాంసి, సెప్టెంబర్ 29 : తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు స్కీంలతో మేలు చేసిందని, కానీ అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో స్కాం లతో నిండా ముంచిందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ విమర్శించారు. మండలకేంద్రంలోని 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఒక్కసారి అవకాశమివ్వమని వచ్చే పార్టీలను నమ్మవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువకులకు అనేక సంక్షేమ ఉపాధి పథకాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్, డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రజనీకాంత్రెడ్డి, సంతోష్ రెడ్డి, లింగన్న, శ్రీధర్రెడ్డి, రాము యాదవ్, ఆకా శ్, అక్షయ్, శివ పాల్గొన్నారు.
జాదవ్ను కలిసిన నాయకులు
బోథ్, సెప్టెంబర్ 29: బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ను శుక్రవారం బోథ్ మండల పార్టీ నాయకులు నేరడిగొండలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గెలుపు కోసం పనిచేస్తామన్నారు. బోథ్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, బోథ్, సొనాల సర్పంచ్లు సురేందర్యాదవ్, సదానందం తదితరులు ఉన్నారు.
శాంతియుతంగా జరుపుకోవాలి..
ఇచ్చోడ, సెప్టెంబర్ 29 :గణేశ్ నిమజ్జనాలను శాంతియుతంగా ప్రజలు జరుపుకోవాలని బోథ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఆయా కాలనీల్లోని గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మం డలకేంద్రంలోని వివిధ విధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ శిరీశ్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు పాండురంగ్, నాయకులు పాల్గొన్నారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ
నేరడిగొండ, సెప్టెంబర్ 29 : ఒకప్పుడు తెలంగాణలో బీడు భూములు, ఎడారిని తలపించేలా పంట చేన్లు ఉండేవని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కుప్టి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సాగునీటి రంగంలోఎంతో పురోగతి సాధించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితం నేడు తెలంగాణ అన్నపూర్ణగా అభివృద్ధి చెందుతుని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షే మం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో వీధుల గుండా తిరుగుతో ప్రజలకు కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని కేసీఆర్ పార్కులో మొ క్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్ సలా ం, బోథ్, నేరడిగొండ బీఆర్ఎస్ మండల కన్వీనర్లు దామెర్ల నారాయణరెడ్డి, అల్లూరి శివారెడ్డి, స్థానిక ఎంపీటీసీ ఒర్స సరిత, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, బోథ్ సర్పంచ్ సురేందర్యాదవ్, ఉప సర్పంచ్ దేవేందర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లె నానక్సింగ్, నాయకులు చంద్రశేఖర్యాదవ్, కొయ్యడి గంగయ్య, కమలాకర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
భవన ప్రారంభోత్సవానికి రండి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో అక్టోబర్ 1న నిర్వహించనున్న మాల సం క్షేమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవానికి రావాలని మాల సంక్షేమ సంఘం జిల్లా, మండల నాయకులు ప్రసాద్, లక్ష్మణ్ బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ను కోరారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అలాగే బీఆర్ఎస్ బోథ్ మండల కన్వీనర్ దామెర్ల నారాయణరెడ్డి, జిల్లా కోఆప్షన్సభ్యుడు తాహెర్బిన్ సలాం, బోథ్, సొనాల సర్ప ంచ్ సురేందర్యాదవ్, సదానం దం ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు.