దండేపల్లి, జనవరి 21 : మండలంలోని రెబ్బెన్పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎవరు ఏయే రంగాల్లో స్థిరపడ్డారో అడిగి తెలుసుకున్నారు. ఊరికోసం, పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తామని తెలిపారు. గురువులు చూపించిన మార్గంలో నడవడం వల్లే జీవితంలో స్థిరపడ్డామన్నారు. ఈ సందర్భంగా బాల్యమిత్రురాలు పుష్పలత కుటుంబానికి రూ.5 వేల సాయమందించారు.