రామగిరి, సెప్టెంబర్ 15: దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేనివిధంగా సింగరేణిలో ఉద్యోగుల విరమణ వయసు పెంపు చారిత్రాత్మక నిర్ణయమని, కార్మికులకు త్వరలోనే మెరుగైన లాభాల వాటా ను ఇప్పించేందుకు కృషి చేస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ తెలిపారు. ఈ మేరకు సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లో బుధవారం జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కార్మికుల రిటైర్మెంట్ వయసు 61 ఏండ్లకు పెంచడంతో సింగరేణి వ్యాప్తంగా 1100 మంది రిటైర్డు కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరారని వెల్లడించారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే వారికి మరో తీపి కబురు చెప్తారన్నారు. యూనియన్ గౌ రవ అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో కారుణ్య నియామకాలనుసాధించుకొని ఇప్పటికి 13,000 మంది మెడికల్ బోర్డుకు హాజరైతే 9,600 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అలాగే 3,400 మంది పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించామన్నారు. కార్మికుల సంక్షేమం పట్టని జాతీయ సంఘాలు ఇప్పుడు గ నుల మీదకు వచ్చి లాభాల వాటా ఇవ్వాలని అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, రెండు అదనపు పీహెచ్డీలు, రూ.10 లక్షల వడ్డీ తిరిగి చెల్లింపు, ఒక శా తం కరెంటు చార్జీల రద్దు, క్వార్టర్లకు ఏసీల వసతి ఇలా బహుళ ప్రయోజనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. టీబీజీకేఎస్ ఉ పాధ్యక్షుడు గౌతం శంకరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీఎం కమిటీ సభ్యుడు పర్స బక్క య్య, దేవ వెంకటేశం, నాగేశ్వరరావు, దేవ శ్రీనివాస్, రవి శంకర్, వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, ఎ ల్లంకి రామారావు, రమేశ్, జక్కుల దామోదర్ రావు, మల్లయ్య, రహీమొద్దీన్, సాధిక్, నరేశ్, గణే శ్, మహేందర్రెడ్డి, శేషగిరి తిరుపతి, లింగం, శ్రీనివాస్, శ్రావణ్, సహదేవ్, జగన్నాయక్, రాజిరెడ్డి, పాశం శ్రీనివాస్, లక్ష్మయ్య, పాశం శ్రీనివాస్, శంకర్, ప్రభాకర్ రావు, రాజయ్య ఉన్నారు.