ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ముక్రా (కే)లో సామూహిక మరుగు దొడ్లు ప్రారంభం
ఇచ్చోడ సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే ముక్రా (కే) ఆదర్శంగా నిలు స్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ పేర్కొన్నారు. దేశంలోని కేంద్ర బృందాలు రాష్ర్టా నికి వస్తే ముక్రా (కే) గ్రామంలో జరిగిన అభి వృద్ధిని చూడకుండా ఉండలేకపోతున్నారని పేర్కొన్నారు. మండలంలోని ముక్రా (కే) గ్రామం లో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా బుధవారం సామూహిక మరుగుదొడ్లను కలెక్టర్ ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రజాప్రతిని ధులు, అధికారులతో కలిసి కలెక్టర్ గ్రామంలోని రోడ్లను చీపుర్లతో ఊడ్చారు. అనంతరం గ్రామం లోని హరిత వనం, చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కను నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. తడి, పొడి చెత్త ద్వారా సేంద్రిదీయ ఎరువులను తయారు చేస్తూ ఆదాయం పొందు తున్న గ్రామంగా గుర్తింపు పొందిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకా లను వందకు వందశాతం సద్వినియోగం చేసు కుంటున్నదని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న గాడ్గె సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ను కలెక్టర్ అభినందించారు. ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎంపీడీవో రాంప్రసాద్, డీఎఫ్వో బర్నోబా, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
పెరటి తోటల పెంపకానికి కృషి చేయాలి
అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు ముక్రా (కే)లోని అంగన్ వాడీ కేంద్రంలో న్యూట్రీషన్ గార్డెన్ను పరిశీలిం చారు. ఇచ్చోడ ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తోటల పెంపకం చేపడుతు న్నారని సూపర్వైజర్ను అడిగి వివరాలను తెలు సుకున్నారు. సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమారా ణి, అంగన్వాడీ టీచర్ మహానంద పాల్గొన్నారు.