శ్రీరాంపూర్, అక్టోబర్ 14: శ్రీరాంపూర్ ఏరియా గనులు, జీఎం ఆఫీస్, ఓసీపీలపై గురువారం స్వ చ్ఛ్ పక్వాడాలో భాగంగా పరిసరాల శుభ్రత, హరితహారం కార్యక్రమాలు నిర్వహించారు. జీఎం ఆఫీస్ ఎదుట నర్సరీలో అటవీ అధికారి అమరేందర్రెడ్డి ఆధ్వర్యంలో జీఎం సురేశ్ మొక్క నాటి నాటారు. ఎస్వోటూ జీఎం కే హరినారాయణగుప్తా, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, ఈఈ కుమార్, రాఘవేంద్రరావు, ఏజీఎం సుధాకర్, డీవైజీఎం శివరావు, చిరంజీవులు, నూక రమేశ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీపై ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు ఓసీపీ ఆవరణలో చెత్తను తొలగించారు. ఇక్కడ మేనేజర్ జనార్దన్, ఈఈ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్, సర్వే ఆఫీసర్ సంపత్, ఈఈ శ్యాంసుందర్రావు, సీనియర్ పీవో బొంగోని శంకర్, నాయకులు గట్టయ్య, మహ్మద్ హుస్సెన్ ఉన్నారు. ఎస్సార్పీ 3గనిపై మేనేజర్ రవికుమార్, ఏజెంట్ విజయభాస్కర్రెడ్డి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గోపాల్రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్క కార్మికుడు ఇంటి ఆవరణలో మొక్క నాటా లని కోరారు. ఇక్కడ డిప్యూటీ మేనేజర్ మహేం ద్ర, అమర్నాథ్రెడ్డి, వెంకటేశం, శంకరయ్య, నాయకులు సారయ్య, సాంబయ్య, వెంకట్రెడ్డి, సుధాకర్, కొంరయ్య ఉన్నారు. శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై మేనేజర్ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కార్మికులు స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఏజెంట్ వెంకటేశ్వర్రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ కే శ్రీనివాస్ పాల్గొని గని ఆవరణలో మొక్కలు నాటారు. ఇక్కడ టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, నాయకులు భూమయ్య, సీనియర్ పీవో అనిల్కుమార్, రాంనర్సయ్య, ఈఈ శ్యాంకుమార్ పాల్గొన్నారు.
రామగిరి, అక్టోబర్ 14 : ఆర్జీ-3 ఏరియాలోని సెంటినరీకాలనీలోని ఎస్సీ క్వార్టర్స్, పార్కుల వద్ద చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఎస్వోటూ జీఎం రఘుపతి, ఏజీఎం సివిల్ రామకృష్ణ, పర్యావరణాధికారి షఫీ, యాకుబ్ పాషా పాల్గొన్నారు.