బజార్హత్నూర్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం
జోరుగా గ్రామ కమిటీల ఎన్నిక
బజార్హత్నూర్, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి గ్రామాల కమిటీలు దోహదపడుతాయని మండల కన్వీనర్ రాజారాం పేర్కొన్నారు. మండలంలోని దేగామలో సోమవారం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తీగల గంగాధర్, ఉపాధ్యక్షులుగా ఎక్కర్ల మల్లేశ్, మల్కాన్ గంగయ్య, కోశాధికారిగా నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తొడసం సంతోష్, కార్యదర్శిగా శేఖర్, ప్రచార కార్యదర్శిగా షాబీర్, కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, బోథ్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుంజాల భాస్కర్రెడ్డి, బజార్హత్నూర్ సహకార సంఘం చైర్మన్ మేకల వెంకన్న, నాయకులు బొడ్డు శ్రీనివాస్, సాయన్న, జాంసింగ్, ప్రకాశ్, రమణ, నరేశ్, మధుకర్, నగేశ్, వినాయక్, శేఖర్ పాల్గొన్నారు.
గడపగడపకూ పథకాలను వివరించాలి
గుడిహత్నూర్, సెప్టెంబర్ 13: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గడగడపకూ వివరించాలని మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ పిలుపునిచ్చారు. మండలంలోని సోయంగూడ, గురుజ, శంభుగూడ, బెల్లూరిలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోయంగూడ అధ్యక్షుడిగా ఉర్వేత బాపురావ్, ఉపాధ్యక్షుడిగా సోయం శ్యాంరావ్, ప్రధాన కార్యదర్శిగా రాంకుమార్, గురుజ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ దశరథ్, ఉపాధ్యక్షుడిగా జీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర శ్రీనివాస్, శంభుగూడ అధ్యక్షుడిగా కాత్లే మనోహర్, ఉపాధ్యక్షుడిగా ఆత్రం శత్రుఘన్, ప్రధాన కార్యదర్శిగా భీంరావ్, బెల్లూరి అధ్యక్షుడిగా కొర్రి పరమేశ్వర్, ఉపాధ్యక్షుడిగా పెందూర్ లాలు, ప్రధాన కార్యదర్శిగా విష్ణును ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కేశవ్గిత్తే, మన్నూర్ ఎంపీటీసీ శగీర్ఖాన్, న్యాను, సర్పంచ్లు గోవింద్, భీంరావ్, జిల్లా నాయకులు లింగంపెల్లి రాజేశ్వర్, రమేశ్, సోయం సతీశ్ పాల్గొన్నారు.
కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం
సిరికొండ, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్లో కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని పార్టీ మండల కన్వీనర్ బాలాజీ పేర్కొన్నారు. లక్ష్మీపూర్(బీ)లో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంపల అర్జున్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండ కన్వీనర్ తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ గుండాల రాజారాం, నాయకులు గోవర్ధన్, అశోక్, జంగు పాల్గొన్నారు.