మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్, మార్చి 30 : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం తో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి రోజు పరీక్షకు 99.75 శాతం మంది హాజరయ్యారు. 9,303 మంది విద్యార్థులకుగాను 9,280 మంది పరీక్ష రాసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 9,298 మందికిగాను 9,275 మంది పరీక్ష రాశారు.
గతంలో ఫెయిలైన విద్యార్థులు ఐదుగురు ఉండగా, అందరూ హాజరయ్యారు. డీ ఈవో యాదయ్య, ఏసీజీఈ, ప్లయింగ్ స్కా డ్లు పలు కేంద్రాలను సందర్శించారు. ప్రధా న పరీక్షలు ముగియగా, జిల్లాలోని 10 కేంద్రా ల్లో వొకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఉండనున్న ది. ఇక ఆసిఫాబాద్లో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. మొదటి రోజు జి ల్లాలో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు.
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వీడ్కోలు చెప్పుకున్నారు. కొందరు సమీప జ్యూస్ సెంటర్లు, హోటళ్లకు వెళ్లి సరదాగా గడిపారు. పరీక్షలు రాసిన తీరు పై చర్చించుకున్నారు. తర్వాత ఏం చేయాలనే విషయాలపై మాట్లాడుకోవడం కనిపించింది.