ఆదిలాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో 1.13 లక్షల యాక్టివ్ జాబ్కార్డుల్లో 2.13 లక్షల మంది కూలీలు క్రమం తప్పకుండా ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలు చేస్తున్న నిబంధనలు కూలీల పాలిట శాపంగా మారుతున్నా యి. ఉపాధి కూలీలు తమ జాబ్కార్డులను ఆధార్కు లింక్ చేసుకోవాలనే నిబంధన కారణంగా 10,975 మంది కూలీలు ఉపాధికి దూరమయ్యే ప్రమాదం ఉంది. గతంలో ప్రతి జీపీలో యేటా 20కి మించి పనులు చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కూలీలకు పనులు దొరకడం లేదు. ప్రస్తుతం జాబ్కార్డులకు ఆధార్ అనుసంధా నం చేయాలనే ఆదేశాలు ఉండడంతో కూలీలు మరింత నష్టపోనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తమ పొట్ట గొట్టే విధంగా ఉన్నాయని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
10,972 మంది కూలీలపై ప్రభావం
ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ అనుసంధాన విధానం 10,975 మంది కూలీలపై ప్రభావం చూపనుంది. 2,13,508 మంది రెగ్యూలర్గా పనులకు వెళ్లే కూలీలు ఉండగా.. వీరిలో 2,06,231 కూలీల జాబ్కార్డులు ఆధార్తో అనుసంధానం అయినవి. ఉపాధి హామీల పథకంలో పనిచేసే కూలీలు వారి వేతనాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా సిబ్బంది గ్రామాల్లోని తమ పరిధిలో పనులు చేసే కూలీల జాబ్కార్డులను ఆధార్ అనుసంధానం చేయాలి. దానిని కూలీలు తమ బ్యాంకు, పోస్టాఫీసు బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోవాలి. ఈ ప్రక్రియకు డిసెంబరు 31, 2023 వరకు గడువు విధించగా ముగిసింది. ఆధార్కు అనుసంధానించిన జాబ్కార్డులు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన తర్వాత కూలీలకు వేతనాలు వారి బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ అవుతాయి. ఇలా ఆధార్ అనుసంధానమైన ఆమోదం లభించనవి వారు ఆదిలాబాద్ జిల్లాలో 10,975 మంది కూలీలు ఉన్నారు. ఆధార్ అనుసంధానం గడువు ముగియడంతో తాము ఉపాధి నష్టపోవాల్సి వస్తున్నదని కూలీలు వాపోతున్నారు. అనుసంధానం కానీ వారు కూలీలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ అధికారులు అంటున్నారు.