ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రామాల్లో వైద్య సిబ్బంది టీమ్ల వారీగా ఇంటింటా జ్వర సర్వేను నిర్వహించారు. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ను ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. 27 బృందాలు 5952 ఇండ్లను సందర్శించాయి. 25,855 మందిని సర్వే చేసి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు.170 మందికి జ్వరం, దగ్గు, కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించారు. మండలంలో జ్వర సర్వే విజయవంతంగా 100శాతం పూర్తయింది.
దస్తురాబాద్, జనవరి 30 :
5952 ఇండ్లు, 27 బృందాలు..
మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహిం చారు. 27 బృందాలు 5952 ఇండ్లను సందర్శించాయి. 25,855 మందిని సర్వే చేసి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. 170 మందికి జ్వరం, దగ్గు, కొవిడ్ లక్షణా లు ఉన్న వారిని గుర్తించారు. వారికి ప్రభుత్వం సరాఫరా చేసిన మందుల కిట్లను అందజేశారు. మాస్కులను ధరించ డంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, కొవిడ్ లక్షణా లు ఉన్న వారు హోం ఐసొలేషన్లో ఉండాలని ప్రజలకు అధికారులు, వైద్యులు అవగాహన కల్పించారు.
100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది. 16822 జనాభా ఉండగా అందరికీ టీకాలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపా రు. కాగా రెండో డోస్ 12972 మందికి వేసినట్లు, 60 ఏండ్లు నిండిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వర్కర్లు 251 మందికి బూస్టర్ డోసు వేశారు. టీనేజర్లకు 1074 మందికి టీకాలు వేశారు.
అందరి సహకారంతో సర్వే పూర్తి చేశాం..
ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే మండలంలో 100 శాతం పూర్తైంది. 27 బృందాలుగా ఏర్పడి 5952 ఇండ్లల్లో విజయవంతంగా సర్వే చేశాం. ఈ సర్వేలో 170 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. వారి కి జాగ్రత్తలు వివరిస్తూ ప్రభుత్వం అందించిన మందుల కిట్లను పంపి ణీ చేశాం. పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖ, మాతా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో మండలంలో 100 శాతం సర్వేను పూర్తి చేశాం.