గంగస్నానానికి అడెల్లి పోచమ్మ నగలు
తరలివెళ్లిన అశేష భక్తజనం
ఊరూరా ఘనస్వాగతం
సారంగాపూర్, అక్టోబర్ 9: గంగనీకు శరణమే అంటూ భక్తులు అడెల్లి పోచమ్మ నగ లను పవిత్ర గోదావరి స్నానానికి తరలిం చారు. గంగానీళ్ల జాతరలో భాగంగా శనివారం అడెల్లి పోచమ్మ నగలను గోదావరి స్నానానికి తరలించారు. అమ్మవారి నగల వెంట వెళ్లే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయంలో శ్రీనివాస్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతి అందించారు. అనంతరం అమ్మవారి నగలను ఆలయం నుంచి భాజభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మండలంలోని అడెల్లి సారంగాపూర్, యాకర్పల్లి, వం జర్, ప్యారమూర్ గ్రామాల మీదుగా దిలావర్పూర్ మండలంలోని మాటేగామ్, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్, మల్లాపూర్ గ్రామాల మీదుగా సాంగ్వీ గ్రామానికి ఊరేగింపుగా చేకున్నారు. ఆయా గ్రామాల్లో అమ్మవారి నగల వెంట గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పోచమ్మ గొప్పతనాన్ని కీర్తిస్తూ భక్తులు పాటలు పాడు తూ నృత్యాలు చేశారు. పోచమ్మ నగలకు ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతించారు.
సీఐ వెంకటేశ్, ఇన్చార్జి ఎస్ఐ రమణారెడ్డి, ట్రెయినీ ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆదివారం జాతరను పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు తెలిపారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్, భక్తులకు తాగునీటి వసతి, వైద్యశిబిరం ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరారు. కాగా అమ్మవారి నగలను ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, చైర్మన్ అయిటి చందు మోశారు. ఇందులో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లావెంకట్ రాంరెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ వంగరవీందర్రెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగురవి కిషన్గౌడ్, ఈవో నారాయణ, టీఆర్ఎస్ మం డల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్ల సం ఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, ఈవో మహేశ్ పాల్గొన్నారు.