ఆసిఫాబాద్,అక్టోబర్7 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు, గ్రామాలను అభివృద్ధి చేసినట్లు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కోవ లక్ష్మి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండా ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వివిధ వర్గాల వారు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమం లో సీనియర్ నాయకుడు నాగయ్య, తదితరులున్నారు.