బాసర, మార్చి, 31: ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్ పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో జరిగిన, జరగబోతున్న, జరు గబోయే కార్యక్రమాలు, కార్యాచరణ, అమలుపై వివిధ శాఖల అధికారులతో చర్చలు జరిగాయి. విద్యార్థులకు సెలవులు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ బస్సు సౌకర్యంపై ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఆర్జీయూకేటీ పలు సమస్యలు తలెత్తి నప్పుడు ఎలా అదిగమించాలో వాటి పరిష్కా రాల మార్గాలపై ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ అధికా రులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ అధికారులు పలు సూచనలు చేశారు. మిషన్ భగీరథ అధికారులతో గోదావరి నుంచి క్యాంపస్ వరకు పైప్లైన్ ద్వారా నీటిని తీసుకుంటున్న సందర్భంలో మిషన్ భగీరథ పథకం అమలు ద్వారా ప్రయోజనాలు, అమలు చేస్తే కావాల్సిన పరికరాలు తదితర అంశాలపై చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ అదికారులతో క్యాంపస్లో ఆరో ప్లాంట్స్ ద్వారా మంచినీటిని అందించే క్రమంలో వచ్చే సమస్యలను ఎలా అదిగమిం చాలో పరిష్కార మార్గాలపై చర్చించారు.
పంచా యతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న వనరులను క్యాం పస్కు ఎలా ఉపయోగించుకొని సమన్వ యంతో ముందుకెళ్లే కార్యాచరణపై చర్చించారు. ఫారెస్టు డిపార్టుమెంట్ అధికారులతో విద్యార్థులు వారం లో ఒకసారి ట్రాకింగ్ వాక్ నిర్వహిం చేందుకు ఏవిధమైన చర్యలు చేపట్టాలి. అడవి జంతువులపై అవగాహన పక్షులపై ఫొటోగ్రఫీ శిక్షణ, బయోడై వర్సిటీ విధానాన్ని అమలు పర్చ డం, ఫొటోగ్రఫీ క్లబ్, కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేయడం నేచర్ క్లబ్ను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు. హెచ్ఎండీఏ అధికారుల తో చర్చిం చారు. ఇప్పటి వరకు లక్ష మొక్కలను నాటామని ఇందులో పూలు, పండ్లు కూరగాయలు తదితర రకాలైన మొక్కలు ఉన్నాయని వారు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రధానంగా క్యాంపస్లో ఉన్న డ్రైనేజీ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ సిస్టంను మెరుగు పరిచేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోవాలో చర్చలు జరిపారు.
సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థ నుండి 50 శాతం రాయితీతో ప్రయాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికా రులతో చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల సౌకర్యార్థం కోసం ప్రధాన ద్వారం దగ్గర పేరెంట్ లాంజ్ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపామని వీసీ వెంకటరమణ తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులకు, ఆర్జీయూకేటీ అధికారులకు మధ్య సమన్వయం కోసం ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి ముందు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కలె క్టర్ వరుణ్ రెడ్డి క్యాంపస్ హెల్త్ సెంటర్లో మార్క్ సాఫ్ట్వేర్ను ప్రారంభించారు. దీనికి ద్వారా హెల్త్ కార్డు ఉపయోగించి వైద్యం పొందేందుకు రూప కల్పన చేశారు. అన్ని విభాగాల అధికార యం త్రాంగం, ఆర్జీయూకేటీ వివిధ విభాగాలకు చెంది న ఫ్యాకల్టీ, ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్స్, పీఆర్వో విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పదో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్ష లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్య లు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అధి కారులకు ఆదేశించారు. జిల్లా వైద్యాశాఖాధికారి రవీందర్రెడ్డితో కలిసి పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు రెండు రోజులే గడువు ఉందని, కేంద్రాల్లో మౌలిక సదుపాయలు కల్పిం చాలన్నారు. 9078 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్ సక్రమంగా ఉండే విధంగా చూసుకో వాలన్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్ల ను మూసివేయాలని సూచించారు. హాల్ టిక్కె ట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకో వాల న్నారు. టోల్ప్రీ నంబర్ 9059987730లో సంప్రదించాలని కోరారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అదించాలని నిర్మల్ కలెక్డర్ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముథోల్లోని సామాజిక దవాఖానను ఆయన సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి డాక్టర్ విజయా నంద్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానకు వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం నయా బాదిలో నిర్మిస్తున్న దవాఖాన భవనాన్ని పరిశీ లించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. దీంతో పాటు గిరిజన గురుకుల బాలికల కళాశాలను తనిఖీ చేసి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి
రైతులు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. ముథోల్లోని భైంసా- బాసర జాతీయ రహదారి పక్కన గల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగును పరిశీలించారు. తహసీల్దార్ తుకారాం, ఏపీవో శిరీష, ఏడీఏ అంజి ప్రసాద్, డా. విజయా నంద్ ఆయా శాఖల అదికారులు ఉన్నారు.