కావలసిన పదార్థాలు
శనగపిండి: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాటా: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: అర కప్పు, ఉప్పు: తగినంత, వంటసోడా: చిటికెడు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నూనెలో దోరగా వేయించాలి. బాగా వేగాక.. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటపై అయిదు నిమిషాలు మగ్గించాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసి, కదపకుండా మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. గరిటెతో కదుపుతూ ముక్కలు ముక్కలుగా చేస్తూ బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుంటే నోరూరించే వెజ్ బుర్జీ సిద్ధం.