నెర్రెలుబారిన నేలతల్లికి చికిత్స చేయడానికి మహామహా వైద్యులంతా తరలివచ్చారు. మనసు నాడి పట్టి ప్రకృతి హృదయ స్పందన విన్నారు. హరితహారమే.. నేలమ్మకు అసలైన ఆభరణమని తేల్చి చెప్పారు. ప్రతి మనిషీ ఒక మొక్క నాటితే అవే అసలైన అక్సిజన్ ప్లాంట్లు అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పచ్చని పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం ప్రారంభమైన గురువారం రోజే డాక్టర్స్ డే కూడా! ఈ నేపథ్యంలో అటు హరితహారాన్ని, ఇటు డాక్టర్స్ డేను సమ్మిళితం చేస్తూ పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిల్మ్నగర్ సాయిబాబా దేవాలయం దగ్గర్లోని చిల్డ్రన్స్ పార్క్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఒక మొక్కను నాటి.. పర్యావరణానికి ప్రణామాలు అర్పించారు. ప్రకృతిని మించిన చికిత్స లేదని, వృక్షమే చెట్టంత వైద్యుడనీ కొనియాడారు.
అందరూ ..భాగం కావాలి
ఒక మహాక్రతువు ద్వారా ప్రతి ఒక్కరిలో హరిత స్ఫూర్తిని కలిగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో భాగమైనప్పుడే ‘గ్రీన్ ఇండియా’ సాధ్యమవుతుంది.
ప్రకృతి బాగుంటేనే..!
మానవాళి చర్యలవల్ల పర్యావరణం కాలుష్యంతో తల్లడిల్లుతున్నది. పచ్చదనాన్ని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు. ప్రకృతి బాగుంటేనే మనం మనగలుగుతాం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా గుర్తించాలి.
వన సంరక్షణతోనే మనుగడ
మొక్కలు నాటాలనే లక్ష్యంతో ‘డాక్టర్స్ డే’ సందర్భంగా వైద్యులను భాగస్వాములు చేయడం గొప్ప విషయం. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. వనాల సంరక్షణ జరిగినప్పుడే ప్రాణికోటి జీవనం సాఫీగా సాగుతుంది.
ప్రతి శుభానికో మొక్క
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ విలువ మనకు అర్థమైంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రాణవాయువును ఇస్తున్న పచ్చదనానికి అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. ప్రతి శుభకార్యానికి మొక్క నాటడం ఆనవాయితీగా చేసుకోవాలి.
-జి.శ్రీనివాస రావు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు
పచ్చని కానుక ఇద్దాం
పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేశాం. కాలుష్యం పెరిగిపోవడంతో అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాటిని నివారించడానికి ఒకటే మార్గం.. పచ్చదనాన్ని పెంచడం.
రోగాలు దరి చేరవు
‘డాక్టర్స్ డే’ రోజున వైద్యులందరితో కలిసి మొక్కలు నాటడం గొప్ప అనుభూతి. పెరుగుతున్న కాలుష్యానికి విరుగుడు పచ్చదనమే. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్టే!
భూమికి కొత్త శక్తి
అనేక రోగాలకు కాలుష్యమే కారణం! దాన్ని తగ్గించడం మన చేతుల్లో పనే! పర్యావరణం ప్రమాదపుటంచుల్లోకి వెళ్తున్న తరుణంలో ‘హరిత హారం’, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ భూదేవికి కొత్త జీవం పోస్తున్నాయి. ప్రతి వ్యక్తీ తన బాధ్యతగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి.
-భాస్కర్ రావు, ఎండీ, కిమ్స్ హాస్పిటల్స్
ఇది మూడోసారి
ఇప్పటికే ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మూడుసార్లు పాల్గొన్నాను. ఇప్పుడు మనం నాటింది చిన్న మొక్కే కావొచ్చు, కానీ, భవిష్యత్ తరాలకు అదో కల్పతరువు. వారసులకు ఆస్తులు కాదు, అనువైన వాతావరణాన్ని అందించడం మన బాధ్యత. మనం భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి.
నిరంతరం కొనసాగాలి
అడవులు తగ్గడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. ‘హరిత హారం’తో ప్రతి పల్లెకూ పచ్చదనాన్ని అందించాలి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక రోజు కాకుండా, నిరంతరం కొనసాగేలా చూడాలి. ఈ హరిత యజ్ఞంలో మరింత మందిని భాగస్వాములను చేయాలి.
ప్రకృతికి వృక్షమే వైద్యుడు
ప్రకృతికి వృక్షమే వైద్యుడు. అనేక జీవరాశుల మనుగడ వృక్షాలపై ఆధారపడి ఉంది. అభివృద్ధి పేరుతో పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా పచ్చదనం కరువవుతున్నది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ పేరుతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నది.
సంరక్షించడం ముఖ్యం
ఏడాదికి ఒక మనిషికి 750 కేజీల ఆక్సిజన్ అవసరం. ప్రకృతి మనకు చెట్ల రూపంలో ఉచితంగా ప్రాణ వాయువును అందిస్తున్నది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలి. పరిసరాలు పచ్చదనంతో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుంది.
కాలుష్యంతోనే సమస్యలు
రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఎంతో నష్టపోతున్నాం. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. గర్భస్థ శిశువులూ మృత్యువాత పడుతున్నారంటే మనం ఎలాంటి వాతావరణంలో బతుకుతున్నామో ఆలోచించుకోవాలి. ఇలాంటి దుష్పరిణామాల నుంచి బయటపడటానికి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఒక్కటే మార్గం.
ముందుతరాలకు స్ఫూర్తి
మనిషికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించేవి చెట్లే! పర్యావరణం బాగున్నప్పుడే మనిషి మనుగడ సాధ్యం. ‘హరిత హారం’, ‘గ్రీన్ చాలెంజ్’ వంటి కార్యక్రమాలు
భవిష్యత్ తరాలకూ స్ఫూర్తినిస్తాయి.
స్ఫూర్తి రగిలించేలా
పచ్చదనం ప్రాధాన్యంపై అవగాహన కల్పించడం, అందరిలో మొక్కలు నాటేలా స్ఫూర్తిని రగిలించడం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంతో సాధ్యమవుతున్నది. ‘డాక్టర్స్ డే’ రోజున మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం.
మంచి కార్యక్రమం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ఓ అద్భుతం. సంతోష్గారి ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమాన్ని ప్రతి తరం గుర్తుంచుకుంటుంది.