Saher Ali Totums Art Studio | మానసిక సమస్యలతో బాధపడేవారు.. ఇష్టమైన రంగులతో నచ్చిన బొమ్మలు వేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని అంటున్నారు హైదరాబాద్కు చెందిన మానసిక వైద్య నిపుణురాలు సహేర్ అలీ. రకరకాల మనో రుగ్మతలతో తన దగ్గరికి వచ్చే రోగులకు ఆమె రంగుల వైద్యం చేస్తారు. వర్ణ చికిత్సల కోసం సహేర్ అలీ.. ‘టొటమ్స్ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఓ పంచవన్నెల ప్రపంచాన్ని సృష్టించారు. వర్ణ చికిత్సకు ఆమె ప్రాణాయామాన్నీ జోడించారు.
శ్వాస పీల్చుకుంటున్నప్పుడు కుంచెను పైకి కదుపుతూ..శ్వాస వదిలేప్పుడు కిందికి కదుపుతూ బొమ్మగీయడం ఎలాగో నేర్పిస్తారు. ‘ఆర్ట్ థెరపీ వల్ల సృజన పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనసు-శరీరం మధ్య సమన్వయం సాధ్యం అవుతుంది’ అని చెబుతారు సహేర్. పసితనంలో వేధింపులకు గురయినవారు, వైఫల్యాల గాయాలకు బలైనవారు, పని ఒత్తిడితో సతమతమయ్యేవారు.. ఇలా ఎంతోమంది ఆమె దగ్గరికి వస్తుంటారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో సహేర్ తన తండ్రిని కోల్పోయారు. ఆ బాధ, ఒత్తిడి పొట్టలోని బిడ్డమీద పడకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ఆర్ట్ థెరపీ ఆమెను కొత్తగా తీర్చి దిద్దింది.
“పాఠాలతో పాటు పాటలు నేర్పిస్తూ పల్లె పాటల చిరునామాగా మారిందీమె !!”