కొవిడ్-19 లాక్డౌన్ ఎత్తేశాక కూడా జనం పబ్లిక్ ప్లేసులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అందులో ముఖ్యమైంది జిమ్. కానీ కొంతమంది సెలబ్రిటీలు జిమ్లకు వెళ్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొని వర్కవుట్స్ చేయమంటూ ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ఇటీవలే నటి పాయల్ ఘోష్ దీనికి సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. “జిమ్కు వెళ్లడం.. వర్కవుట్స్ చేయడం అందరికీ ఆరోగ్యకరమే. అలాగని నేను రోజూ వెళ్లను. నాకు కిక్ బాక్సింగ్లో ప్రవేశం ఉంది. రెగ్యులర్ బ్రిస్క్ వాక్ చేయడం, వారానికి రెండుసార్లు 8-10కిలోమీటర్ల దూరం నడవడం అలవాటు. కేవలం ఫిజిక్ మెయింటెయిన్ చేయడానికే కాదు, నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కూడా జిమ్కు వెళ్తుంటాను. కానీ చాలామంది జీరో సైజ్ కోసమే నేను జిమ్కు వెళ్తుంటానని అపోహపడతారు. ఫిట్నెస్ అంటే సైజ్ జీరో మాత్రమే కాదు. నేను మంచి డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తాను. బాడీ షేపింగ్తో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం” అని చెప్పింది పాయల్.