అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ‘ఇన్టాక్సికేషన్’కు గురవుతుంది. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. దీనివల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో సోడియం స్థాయులు పడిపోతాయి. ఫలితంగా కణాలు ఉబ్బిపోతాయి.
ఎందుకంటే కణాల లోపల, బయట ఉండే ద్రవాలను సోడియం నియంత్రిస్తుంది. సోడియం పరిమాణం పడిపోగానే.. అవసరం అయిన దానికంటే అధికమోతాదులో ద్రవాలు కణాల లోపలికి చేరతాయి. ఇలా జరగడం వల్ల మూర్ఛ,వికారం, తలనొప్పిలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు, గుండె కొట్టుకొనే వేగం తగ్గడంలాంటి ప్రమాదకర సంకేతాలు వెలువడతాయి. కాబట్టి దేహానికి ఎంత అవసరమో అన్ని నీళ్లు తాగితే చాలంటున్నారు వైద్య నిపుణులు. వాట్సాప్ గురువుల మాట విని.. చెంబులకొద్దీ తాగేయకండి.