రాగులు: ఒక కప్పు, మినుప పప్పు: అర కప్పు,
శనగలు: అరకప్పు, టమాట: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, కొబ్బరి తురుము: పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్, మెంతులు: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, సోంపు: ఒక టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క,
లవంగాలు: రెండు, యాలకులు: రెండు, పసుపు: అర టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా,
కరివేపాకు: ఒక రెబ్బ,
వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము: ఒక టేబుల్ స్పూన్
ముందుగా రాగులు, మినుప పప్పు, మెంతులను బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టి మిక్సీపట్టాలి. తర్వాత, మరో మూడు గంటలు నానబెట్టాలి. బాగా నానిన పిండి మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దోశల పిండిలా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్మీద దోశల పెనం పెట్టుకొని రాగిపిండి మిశ్రమంతో దోశ వేసుకుని పైనుంచి శనగల మిశ్రమం, సన్నగా తరిగిన టమాట, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి ధనియాలపొడి వేసి బాగా కాలిన తర్వాత.. పైనుంచి కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలు. వేడివేడి మసాలాతో విటమిన్ దోశ రెడీ.