ఆశ్వయుజం వచ్చిందంటే చాలు. పండగల సందడి నెలకొంటుంది. వర్షాలు తగ్గుముఖం పడతాయి. శరదృతువు ప్రారంభమవుతుంది. వాతావరణం, పరిసరాలు ఆహ్లాదకరంగా మారిపోతాయి. దసరా నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత దీపావళి, కార్తిక దీపారాధనలు.. ఇలా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ పరిస్థితుల్లో ఉత్సవాలను తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలి. కొవిడ్ తీవ్రత తగ్గిందే కానీ, పూర్తిగా సమసిపోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిలోనే పూజలు నిర్వహించాలి. అతిథులు కూడా సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాస్కులు తప్పనిసరి. గడప దగ్గర ఓ శానిటైజర్ పెట్టడం మరచిపోకండి. జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి.