‘నిద్రలేమి’ నేటితరాన్ని వేధిస్తున్న సమస్య. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది నిద్రలేమితో బాధపడుతున్నారని డాక్టర్ అబౌబాకరీ నంబీమా హెల్త్ ఇన్స్టిట్యూట్ సర్వే తెలియజేస్తున్నది. నిద్రలేమికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఆహారమే. తిండి కొద్దీ నిద్ర అని చెబుతున్నారు నిపుణులు. కంటి నిండా నిద్రపోవడానికి ఐదురకాల ఆహార పదార్థాలు సహకరిస్తాయి.
బచ్చలికూర- పెరుగు: బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బచ్చలికూర, పెరుగు కాంబినేషన్లో మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. చపాతీలతో గానీ, బ్రౌన్రైస్తో గానీ బచ్చలికూర తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
బీన్స్- అవిసె గింజలు: బీన్స్లో ఫోలిక్ యాసిడ్, బి6, బి12 విటమిన్లు అధికంగా ఉంటాయి. జీవక్రియలు మెరుగుపరచడానికి ఇవి సాయపడతాయి. అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. గోధుమ, అవిసె మిశ్రమంతో చేసిన రొట్టెలను బీన్స్తో తింటే ఒమేగా ఫ్యాటీ-3 ఆమ్లాలు అంది, నిద్రలేమిని దూరం చేస్తాయి.
ఆలుగడ్డ- చపాతీ: ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆలుగడ్డ, చపాతీల కాంబినేషన్ ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది. సెరెటోనిన్ అనే జీవరసాయనం ఉత్తేజితమై జీవక్రియకు ఆటంకం కలిగించే ఆమ్లాలు విచ్ఛిన్నం అవుతాయి. దీనివల్ల మంచి నిద్ర పడుతుంది.