కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 22 : ఈ నెల 25 లోగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో మంగళవారం వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, డంప్ యార్డుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని పంచాయతీలను 3 భాగాలుగా విభజించి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రకృతి వనాల్లో లక్ష్యం మేరకు మొ క్కలు నాటాలని సూచించారు. డంప్ యార్డుల పనులు పూర్తి చేసి వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్డు నుంచి కాగజ్నగర్ మున్సిపాలిటీ, కాగజ్నగర్ నుంచి కౌటాల, ఆసిఫాబాద్ పట్టణంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి జైనూర్ వరకు త్రీటైర్ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు, ఇందుకోసం అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జూలై 1 నుంచి హరితహారం ప్రారంభం కానున్నదని, శ్రద్ధతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, గ్రామసభలు సమావేశాలు నిర్వహించాలని సూ చించారు. అదనపు కలెక్టర్ రాజేశం, డీపీవో శ్రీ కాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్చార్జి ర వికృష్ణ , శాఖల అధికారులు పాల్గొన్నారు.