ముంబై, జూన్ 8: ఎడ్యుటెక్ సేవల సంస్థ అప్గ్రేడ్..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో సేవలు అందిస్తున్న సంస్థ..తాజాగా హైదరాబాద్తోపాటు ఢిల్లీ, కోల్కతాల్లో సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాపార విస్తరణకు అవసరమైన వెయ్యి మంది సిబ్బందిని వచ్చే మూడు నెలల్లో నియమించుకోనున్నట్లు కంపెనీ సీఈవో అర్జున్ మోహన్ తెలిపారు.